logo

మోడీ నిరంకుశ పాలకు చరమగీతం పాడుదాం. ఇండియా కూటమిని గెలిపిద్దాం

కొత్తగూడెం : శుక్రవారం నాడు స్థానిక కొత్తగూడెంలోని శేషగిరి భవన్ నందు అఖిలపక్షం ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు మాట్లాడుతూ .దేశంలో మోడీ నిరంకుశ పాలను వ్యతిరేకంగా జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. నియోజకవర్గంలోనీ ఎన్ఎండిసి లాంటి మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరింప చేయాలని పాలవంచ కేటీపీఎస్ నందు ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని నియోజకవర్గంలోని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తారని చెప్పారు.రేపు ప్రకాశం స్టేడియం నందు జరుగు భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె షాబీర్ పాషా, జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, చలిగంటి శ్రీనివాసరావు, చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, మాచర్ల శ్రీనివాస్, చారి, బోయిన విజయ్, గిద్దాడ నగేష్,కాంగ్రెస్ నాయకులు కోనేరు సత్యనారాయణ, నాగ సీతారాములు, జేవీఎస్ చౌదరి, తూము చౌదరి, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, సిపిఎం నాయకులు అన్నవరపు సత్యనారాయణ, రమేష్, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

0
243 views